Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 85 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • వడ్డీ రేట్లపై ఫెడ్ రిజర్వ్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయిన మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం ఈ రాత్రికి వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడి 63,229కి చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 18,756 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.39%), టాటా మోటార్స్ (1.49%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.42%) రిలయన్స్ (1.28%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.09%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-0.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.98%), యాక్సిస్ బ్యాంక్ (-0.95%), భారతి ఎయిర్ టెల్ (-0.66%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.49%).

More Telugu News