East Godavari District: ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురి దుర్మరణం

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • హైదరాబాద్ నుంచి కారులో వెళ్తుండగా నల్లజర్ల మండలంలో ప్రమాదం
  • మృతుల్లో ముగ్గురు మహిళలు
6 dead in road accident in East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన 8 మంది హైదరాబాద్ నుంచి కారులో సొంతూరికి బయలుదేరారు. ఈ క్రమంలో కారు జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి శివారుకు చేరుకున్న తర్వాత అదుపుతప్పి ఆగివున్న లారీని ఢీకొట్టింది. 

ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, చిన్నారి కూడా ఉన్నారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News