పేపర్ లీకేజీ నిందితులు పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతి
- నిందితులకు గ్రూప్ 1 పరీక్షల హాల్ టిక్కెట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
- నిందితులను పరీక్షకు అనుమతించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యానికి నో
- షమీమ్, సురేష్, రమేష్, సుస్మితలకు హాల్ టిక్కెట్లు!
దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో విచారణ జరిగింది. పరీక్షకు అనుమతించి... ఫలితాలు ప్రకటించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నిందితులు షమీమ్, సురేష్, రమేష్, సుష్మితలకు హాల్ టిక్కెట్లు ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ అప్పీలును కొట్టివేసింది.