2019లో అందువల్లే ఓడిపోయాం.. దేవినేని ఉమా
- పసుపు, కుంకుమ ఇచ్చాం కదాని కొంత నిర్లక్ష్యంగా ఉన్నామన్న ఉమా
- వైసీపీ వాళ్లు కాళ్లు గడ్డాలు పట్టుకుని గెలిచేశారని మాజీ మంత్రి ఎద్దేవా
- మైలవరం, నందిగామకు చెందిన వైసీపీ నేతలపై మండిపడ్డ ఉమా
మైలవరం, నందిగామలో వైసీపీ నేతల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయిందని దేవినేని ఉమా విమర్శంచారు. మైలవరంలో తండ్రీ కొడుకులు ఇసుక దోచుకుంటున్నారని, మైలవరం, జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేలకు నెలకు రూ.7 కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు. కొండలు గుట్టలు దోచేసుకుంటున్నారని మండిపడ్డారు. నందిగామలో వసూలు బ్రదర్స్ ఇసుక దందా చేస్తూ నెలనెలా తాడేపల్లికి రూ.7 కోట్లు పంపుతున్నారని దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు.