ఉత్తర కాశీలో తీవ్రమైన మత ఉద్రిక్తతలు.. నగరాన్ని విడిచి వెళ్తున్న ముస్లింలు
- జూన్ 15 నాటికి ముస్లింలు వెళ్లిపోవాలని హిందూ సంఘం ఆదేశాలు
- ఒక్కసారిగా పెరిగిన ముస్లిం వలసలు
- నగరాన్ని వీడిన బీజేపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు
బీజేపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ జాహిద్ కూడా తన కుటుంబంతో కలిసి నగరాన్ని విడిచిపోయారంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 25 ఏళ్లుగా జాహిద్ అక్కడే ఉంటున్నారు. తన షాపులో ఉన్న వస్తువులన్నీ తీసుకుని డెహ్రాడూన్ వెళ్లిపోయారు. ఆయనతో పాటు మరో 6 కుటుంబాలు కూడా షాపులు ఖాళీ చేసి వెళ్లిపోయాయి.