Sensex: నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 294 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 91 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 294 పాయింట్లు నష్టపోయి 62,849కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 18,634కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.30%), ఎల్ అండ్ టీ (1.04%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.15%), రిలయన్స్ (0.14%). 

టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-2.55%), సన్ ఫార్మా (-2.19%), టెక్ మహీంద్రా (-1.99%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.79%), యాక్సిస్ బ్యాంక్ (-1.52%).

More Telugu News