అంగన్వాడీ టీచర్ మృతిపై డీజీపీ సహా పలువురికి చంద్రబాబు లేఖ
- హనుమాయమ్మ మృతిపై డీజీపీతో పాటు జాతీయ కమిషన్లకు లేఖ
- మృతిపై కేంద్ర దర్యాఫ్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్
- మృతురాలి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలన్న బాబు
టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సుధాకర్ భార్య హనుమాయమ్మను సోమవారం కొండల్రావు అనే వ్యక్తి ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేశాడు. హనుమాయమ్మ అంగన్వాడీ టీచర్ గా పని చేస్తోంది. స్థానిక వైసీపీ నేత కొండల్రావు, టీడీపీ నేత సుధాకర్ కుటుంబాలకు మధ్య పొలం తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఉన్న హనుమాయమ్మను కొండల్రావు ట్రాక్టర్ కు ఉన్న గొర్రుతో ఢీకొట్టడంతో ఆమె కిందపడింది. ఆమె ఇంకా ప్రాణాలతో ఉందేమో అని భావించి ట్రాక్టరును ఆమె పైకి ఎక్కించాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.