ప్రభుత్వం మా డిమాండ్లు చాలావరకు నెరవేర్చింది: బొప్పరాజు
- మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ
- మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై సానుకూల స్పందన వచ్చిందన్న బొప్పరాజు
- మెరుగైన పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పారన్న వెంకట్రామిరెడ్డి
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, మంత్రుల నోట జీపీఎస్ అనే పదమే రాలేదని అన్నారు. మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారని వెల్లడించారు. కాగా, 12వ పీఆర్సీ చైర్మన్ గా ఎవరి పేరు ప్రతిపాదనకు రాలేదని తెలిపారు.