ఒడిశా ప్రమాద ఘటన బాధ్యులపై కఠిన చర్యలు: ప్రధాని మోదీ
- బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ప్రధాని
- ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యం అందిస్తామని వెల్లడి
- ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి మోదీ థ్యాంక్స్
ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మోదీ గాయపడిన కొంతమంది ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. గాయపడిన వారిని కలిసినట్లు మోదీ చెప్పారు. ట్రాక్ పునరుద్ధరణకు రైల్వే కసరత్తు చేస్తోందన్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్లో మూడు వేర్వేరు ట్రాక్లపై బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి.