అభిమానులారా రంగంలోకి దిగండి.. వారి ప్రాణాలు కాపాడండి: చిరంజీవి
- కోరమండల్ రైలు ఘోర ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి
- క్షతగాత్రులకు అవసరమైన రక్తదానం చేయాలని సమీప ప్రాంత అభిమానులకు పిలుపు
- మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన జూనియర్ ఎన్టీఆర్
‘కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటన, భారీ ప్రాణనష్టం నన్ను ఎంతగానో కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రక్తం అవసరం ఉంటుందని అర్థం చేసుకుంటున్నా. రక్తదానం చేసి వారి ప్రాణాలను రక్షించేందుకు సమీప ప్రాంతాల్లోని మా అభిమానులు, సేవా దృక్పథులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.