సముద్రంలో మునిగిపోతున్న యువకులను కాపాడిన ఎమ్మెల్యే
- గుజరాత్లో బుధవారం వెలుగు చూసిన ఘటన
- పట్వా గ్రామ సమీపంలో నలుగురు యువకుల సముద్ర స్నానం
- అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రమాదంలో పడ్డ యువకులు, సాయం కోసం ఆర్తనాదాలు
- వెంటనే నీళ్లలోకి దూకి ముగ్గురిని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే హీరా సోలంకీ
- నాలుగో యువకుడి మృతి, సాయంకాలం మృతదేహం లభ్యం
అయితే, అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారు నీళ్లల్లో మునిగిపోవడం మొదలైంది. భయపడిపోయిన యువకులు పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేస్తూ సాయం కోసం వేడుకున్నారు. అదే సమయంలో బీచ్లో ఉన్న ఎమ్మెల్యే సోలంకీ వారిని గమనించి రంగంలోకి దిగారు. మరో ఆలోచన లేకుండా ఆయన తక్షణం సముద్రంలోకి దిగి ముగ్గురు యువకులను కాపాడారు. అయితే, జీవన్ గుజారీ మాత్రం నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం సాయంత్రం అతడి మృతదేహం లభించింది.