నన్ను, రోజాను, కొడాలి నానిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు: అంబటి రాంబాబు

ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లిలో తనను ఓడించేందుకు కొత్త వస్తాదులు వస్తున్నారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లికి వచ్చి మీటింగులు పెట్టారని... తనను ఓడించాలనే పట్టుదలతోనే వీరు మీటింగ్ లు పెట్టారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. 

కొడాలి నాని, రోజాలను ఓడించేందుకు కూడా చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబును బీసీలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు

Ambati Rambabu
YSRCP
Kodali Nani
Roja
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News