Road Accident: కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం

  • మైసూరు జిల్లాలో ఘటన
  • బళ్లారి నుంచి మైసూరు వస్తున్న కుటుంబం
  • ఇన్నోవా కారును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
  • 10 మంది అక్కడికక్కడే మృతి
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు
Road rage killed 10 people in Karnataka

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు సమీపంలో ఓ ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. తిరుమకుడాలు, నరసిపురా మధ్య ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. 

బళ్లారి నుంచి వారు మైసూరు సందర్శనకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దాంతో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయింది. 10 మంది సంఘటన స్థలంలో ప్రాణాలు విడిచారు. అతికష్టమ్మీద మరికొందరిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

నిన్న కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాత పడడం తెలిసిందే.

More Telugu News