Naresh: రేపే 'మళ్లీ పెళ్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. వేదిక ఎక్కడంటే..!

  • నరేశ్ హీరోగా రూపొందిన 'మళ్లీ పెళ్లి'
  • ఆయన సరసన నాయికగా పవిత్ర లోకేశ్ 
  • దర్శకత్వం వహించిన ఎమ్మెస్ రాజు 
  • ఈ నెల 26వ తేదీన సినిమా విడుదల
Malli Pelli Pre Release Event Date Confirmed

హీరోగా నరేశ్ అనేక చిత్రాలలో నటించాడు. ఆ తరువాత కాలంలో ఆయన కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఆయన లేని సినిమా అంటూ లేదు. అలాంటి నరేశ్ మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు హీరోగా రావడానికి రెడీ అవుతున్నాడు. దాంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. 

నరేశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమా పేరే 'మళ్లీ పెళ్లి'. ఆయనే విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. తన వయసుకి తగిన పాత్రలోనే ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఎమ్మెస్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రేపు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనుంది. 

ఈ సినిమాలో పవిత్ర లోకేశ్ కథానాయికగా కనిపించనుంది. మరో ముఖ్యమైన పాత్రలో వనిత విజయ్ కుమార్ కనిపించనుంది. కొంతకాలంగా నరేశ్ - పవిత్ర లోకేశ్ గురించిన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి కలిసి, తమ జీవితంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను కలుపుతూ ఈ సినిమా చేయడం ఆసక్తిని రేపుతోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News