టీడీపీ మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు.. విందులో గోదావరి రుచులు!
- ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు
- ప్రతినిధుల సభకు లక్షమంది, బహిరంగ సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా
- ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాల వడ్డింపు
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల సుబ్బరాజు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహానాడు తొలి రోజు ప్రతినిధుల సమావేశానికి లక్షమంది, తర్వాతి రోజు బహిరంగ సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్టు చెప్పారు. వీరందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, విందులో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన అన్ని రకాల వంటకాలు వడ్డిస్తామన్నారు.