అవుకు రిజర్వాయర్ లో పడవ బోల్తా... ఇద్దరు మృతి
- నీటిలో పడిపోయిన 11 మంది పర్యాటకులు
- సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
- ఒడ్డుకు చేరిన తర్వాత ఓ మహిళ మృతి... చికిత్స పొందుతూ మరో మహిళ కన్నుమూత
- విహారయాత్రకు వచ్చిన తంజావూరు వాసులు
ఆదివారం కావడంతో అవుకు రిజర్వాయర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. తంజావూరు నుంచి వచ్చిన ఓ కుటుంబంతో పాటు మరికొందరు రిజర్వాయర్ లో పడవ విహారానికి వెళ్లారు. ఇంతలో పడవ బోల్తా పడడంతో వారంతా నీళ్లల్లో పడి గల్లంతయ్యారు. పర్యాటకులు లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో అధిక ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. కాగా, మరణించిన మహిళలను ఆశాబీ, నూర్జహాన్ గా గుర్తించారు.