Advaith Dhanunjay: 'మరువ తరమా' నుంచి ఫస్ట్ సాంగ్ .. యూత్ మనసు దోచేస్తున్న మెలోడీ!

  • ప్రేమకథా చిత్రంగా 'మరువ తరమా'
  • నూతన నటీనటులతో సాగే సినిమా 
  • దర్శకుడిగా చైతన్య వర్మ పరిచయం 
  • ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్   
Maruva Tharama Lyrical song released

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు మరింతగా ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా చిన్న సినిమాలలో ప్రేమకథా చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ తరహా కథల పట్లనే యూత్ ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్రేమకథ ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతోంది. ఆ సినిమా పేరే 'మరువ తరమా'.
 
ఈ సినిమాతో అద్వైత్ ధనుంజయ .. అతుల్య చంద్ర .. అవంతిక నల్వా హీరో .. హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. రమణమూర్తి - విజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ సినిమాకి, చైతన్య వర్మ దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'పాదం పరుగులు తీసే .. ప్రాణం ఉరకలు వేసే .. పరువం పరిచిన ఆశే .. ప్రాయం పదమని తోసే' అంటూ ఈ పాట సాగుతోంది.

 విజయ్ బుల్గనిన్ స్వరపరిచిన ఈ పాటకి చైతన్య వర్మ సాహిత్యాన్ని అందించగా, రోహిత్ ఆలపించాడు. హీరో .. హీరోయిన్స్ పై చిత్రీకరించిన ఈ పాటకి, యూ ట్యూబ్ లో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీగా మార్కులు కొట్టేస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News