ఆయుధాలు లేని కొత్త తరహా ఉగ్రవాదాన్ని ‘ది కేరళ స్టోరీ’ బట్టబయలు చేసింది: జేపీ నడ్డా
- ఇలాంటి ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమాని వ్యాఖ్య
- బెంగళూరులో యువతతో కలిసి సినిమా చూసిన బీజేపీ అధ్యక్షుడు
- ఐనాక్స్ లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసిన కర్ణాటక బీజేపీ నేతలు
ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ చిత్రాన్ని వీక్షించారు. తీవ్ర వ్యతిరేకత తర్వాత బీజేపీ రాష్ట్ర శాఖ బెంగళూరులోని ఐనాక్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక షోను ఎంపీ తేజస్వి సూర్య, పలువురు యువతతో కలిసి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయుధాలు ఉపయోగించని కొత్త తరహా ఉగ్రవాదాన్ని ఈ చిత్రం బట్టబయలు చేసిందని అన్నారు.
‘మనం తుపాకులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రితో కూడిన ఉగ్రవాదం గురించి విన్నాం. కానీ, ఆయుధాలు లేకుండా చేసిన ఉగ్రవాదం గురించి ఈ సినిమా కళ్లకు కట్టింది. ఇది ప్రమాదకరమైన ఉగ్రవాదం. ఈ రకమైన ఉగ్రవాదం ఒక రాష్ట్రానికి, ఒక మతానికి సంబంధం లేదు. యువతలను ఎలా ప్రభావితం చేస్తున్నారో, తప్పుడు మార్గాలను అనుసరించేలా ఎలా చేస్తున్నారో ఈ చిత్రం చూపించింది. అటువంటి విషపూరిత ఉగ్రవాదాన్ని, దాని వెనుక ఉన్న కుట్రను ఈ సినిమా విజయవంతంగా బహిర్గతం చేసింది. మన యువత తప్పుదారి పట్టి, తిరిగి రాని స్థితికి చేరుకున్నారు. ఈ చిత్రం అలాంటి వారి కళ్లు తెరిపించింది. వారంతా దీన్ని చూడాలి’ అని పేర్కొన్నారు.