తొలిరోజే ‘ది కశ్మీర్ ఫైల్స్’ను దాటేసిన ‘ది కేరళ స్టోరీ’
- ఆదా శర్మ ప్రధాన పాత్రలో చిత్రం
- నిన్న దేశ వ్యాప్తంగా విడుదల
- తొలి రోజు మంచి కలెక్షన్లు రాబట్టిన సినిమా
దాంతో నిన్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. మొదటి రోజు దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇది అంచనా మాత్రమే. వాస్తవ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారాంతంలో కలెక్షన్లు ఇంకా పెరగొచ్చని అంటున్నాయి. చిన్న బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా భారీ విజయం సొంతం చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్ ఫైల్స్ చిత్రం తొలి రోజు రూ. 3.55 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ, తర్వాత రోజు రోజుకు కలెక్షన్లు పెరిగాయి.