నిన్న పేలుడు జరిగిన చోటే నేడు ఎదురుకాల్పులు
- జమ్మూకశ్మీర్ లో లష్కరే తోయిబా టెర్రరిస్టు కాల్చివేత
- కొనసాగుతున్న భద్రతాబలగాల ఆపరేషన్
- జీ 20 సదస్సు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు
బారాముల్లాలోని కర్హామా కుంజర్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం అందినట్లు ఎస్ఎస్ పీ అమోద్ తెలిపారు. దీంతో శనివారం ఉదయం భద్రతా బలగాలు ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయని వివరించారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడని అధికారులు పేర్కొన్నారు. చనిపోయిన ఉగ్రవాది దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాకు చెందినవాడని, లష్కరే తోయిబా ఉగ్రవాది అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.