Malli Pelli: నరేశ్, పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి' చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల

  • నరేశ్ జీవితంలోని సంఘటన ఆధారంగా 'మళ్లీ పెళ్లి'
  • ప్రధాన పాత్రల్లో నరేశ్, పవిత్రా లోకేశ్
  • ఎంఎస్ రాజు దర్శకత్వంలో చిత్రం
  • ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించిన నరేశ్
  • మే 26న థియేటర్లలో రిలీజ్
Romantic song from Malli Pelli movie out now

సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకుడు. కాగా, ఈ చిత్రం నుంచి 'రా రా హుజూరు నాతో' అనే రొమాంటిక్ సాంగ్ ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. అరుళ్ దేవ్ సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. గాయని ఇందు సనత్ ఈ గీతాన్ని ఆలపించారు.

'మళ్లీ పెళ్లి' చిత్రం నటుడు నరేశ్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు నరేశ్ నిర్మాత. 'మళ్లీ పెళ్లి' చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News