పెండింగ్ బిల్లులపై గవర్నర్ డాక్టర్ తమిళిసై కీలక నిర్ణయం
- డీఎంఈ పదవీ విమరణ వయసు పెంపు బిల్లుకు నో
- పురపాలక చట్ట సవరణ, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు పెండింగ్
- వాటిపై వివరణ కోరిన గవర్నర్
పురపాలక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇప్పటిదాకా మూడేళ్ళ గడువు ఉంది. ఆ గడువును నాలుగేళ్ళకు పెంచుతూ మున్సిపల్ చట్టంలో సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. కానీ, బిల్లు ఆమోదంపై నిర్ణయానికి మరిన్ని వివరాలు అవసరం ఉంటాయని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి తీసుకొచ్చిన బిల్లు విషయంలో కూడా వివరణ కావాలన్న గవర్నర్ తమిళిసై దాన్ని కూడా పెండింగ్ లో ఉంచారు.