Bandi Sanjay: కేసీఆర్ ను చూసి దేశం నవ్వుతోంది.. విశాఖ స్టీల్ ప్లాంట్ పైన పారిపోయాడు: బండి సంజయ్

  • ఇప్పుడు పైసలు లేవని చెబుతున్నాడన్న కరీంనగర్ ఎంపీ
  • కేసీఆర్ చెప్పే మాటలు అన్నీ కోతలే అని వ్యాఖ్య
  • కేసీఆర్ ను చూసి నవ్వుతున్నారంటే మనం నవ్వులపాలు అవుతున్నట్లే అన్న బండి సంజయ్
Bandi Sanjay comments on Telangana CM KCR

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్డింగ్ వేస్తానని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పారిపోయారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం అన్నారు. కేసీఆర్ చెప్పే మాటలు అన్నీ కోతలే అని ఎద్దేవా చేశారు. ఇక్కడ తెలంగాణలో ఏం చేయని కేసీఆర్ ఆంధ్ర ప్రదేశ్ లో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడేమో తమ వద్ద పైసలు లేవని చెబుతున్నారన్నారు. కేసీఆర్ వద్ద పైసలు బాగా ఉన్నాయి... అని పాపం ఆంధ్ర వాళ్లు అనుకునేలా మాట్లాడాడని, మా ఆంధ్రాలో కూడా ఏదో చేస్తాడని అనుకుంటున్నారని, ఇప్పుడు కేసీఆర్ తీరును చూసి అలా అనుకున్న వాళ్లు వాళ్ల చెప్పుతో వాళ్లే కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

బిడ్ వేస్తానని వెనక్కి పోయిన కేసీఆర్ ను చూసి దేశం మొత్తం నవ్వుకుంటోందన్నారు. కేసీఆర్ ను చూసి నవ్వుతున్నారు అని అంటే మనం కూడా నవ్వులపాలు అవుతున్నట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారన్నారు. ఏం మాట్లాడుతాడో కేసీఆర్ కే తెలియదని, చెప్పింది ఒక్కటీ చేయడన్నారు.

More Telugu News