యూపీలో తుపాకుల పాలన కొనసాగుతోంది: అసదుద్దీన్
- రాజ్యాంగంపై ప్రజల్లో నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించిన ఎంఐఎం నేత
- అతీక్, అష్రాఫ్ ల హత్యలో యూపీ ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపణ
- హత్యపై సుప్రీంకోర్టు కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్
పోలీసుల సమక్షంలోనే హంతకులు కాల్పులు జరపడంపై అసదుద్దీన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరిగాక దేశంలో రాజ్యాంగం, శాంతిభద్రతలపై ప్రజల్లో నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ దారుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపించారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ కమిటీలో యూపీకి చెందిన అధికారులకు చోటివ్వకూడదని అన్నారు. తనకు భయంలేదని, తప్పకుండా ఉత్తరప్రదేశ్ కు వస్తానని, చనిపోవడానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు.