అతీక్ అహ్మద్ కాల్చివేత కేసు.. యూపీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
- వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో అతీక్, ఆయన సోదరుడి కాల్చివేత
- మీడియా ముసుగులో వచ్చి కాల్పులకు తెగబడిన దుండగులు
- రాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదనపు బలగాలను మోహరించిన అధికారులు
ప్రయాగ్రాజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా అదనపు బలగాలను రప్పించి అన్ని జిల్లాల్లోనూ మోహరించారు. అతీక్, ఆయన సోదరుడిని కాల్చి చంపిన ముగ్గురు నిందితులను ఆ వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మీడియా ప్రతినిధుల ముసుగులో వచ్చి ఘాతుకానికి పాల్పడినట్టు ప్రయాగ్రాజ్ పోలీసులు తెలిపారు.
అతీక్, ఆయన సోదరుడు అష్రాఫ్ హత్య జరిగిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేశారు.