KTR: అంబేద్కర్ లేకపోతే.. తెలంగాణ లేదు: కేటీఆర్

  • హైదరాబాద్ పంజాగుట్ట కూడ‌లిలో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన కేటీఆర్
  • అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ ఏర్పాటైంద‌ని వెల్లడి
  • కేసీఆర్ ద‌మ్మున్న నేత‌ అని వ్యాఖ్య 
ktr speech on ambedkar birth anniversary

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ పంజాగుట్ట కూడ‌లిలో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్క‌ర్ లేక‌పోతే తెలంగాణ లేద‌ని, ఆయన రాసిన రాజ్యాంగం వ‌ల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంద‌ని చెప్పారు.

అంబేద్కర్ చెప్పినట్లుగానే నడుచుకుంటున్నామని, ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు సాగుతున్నామని కేటీఆర్ అన్నారు. ‘‘ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌మ్మున్న నేత‌. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఆయనకే సాధ్యం. కేసీఆర్ అమ‌లు చేస్తున్న ద‌ళిత‌బంధు.. సాహ‌సోపేత‌మైన ప‌థ‌కం’’ అని చెప్పారు.  

కొత్త పార్ల‌మెంట్‌కు కూడా అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడ‌లికి అంబేద్క‌ర్ పేరు పెడతామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు.

More Telugu News