సీఎం జగన్ కాలికి గాయం.. రేపటి ఒంటిమిట్ట పర్యటన రద్దు
- ఏప్రిల్ 5న ఒంటిమిట్టలో రాములవారి కల్యాణోత్సవం
- పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉన్న సీఎం జగన్
- ఉదయం వ్యాయామం చేస్తుండగా బెణికిన కాలు
- ప్రయాణాలు చేయరాదన్న వైద్యులు
ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5న సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని ఆలయానికి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని భావించారు. అధికారులు కూడా అందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కాలు బెణకడంతో పర్యటన రద్దు కాగా, ఆ మేరకు అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.