ఫలించిన డ్రైవర్ నిరీక్షణ.. రూ.49 పెట్టుబడితో రాత్రికి రాత్రి రూ.1.5 కోట్ల ఆదాయం
- మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఉదంతం
- రెండేళ్లుగా ఆన్లైన్ క్రికెట్ యాప్లో గేమ్స్ ఆడుతున్న డ్రైవర్
- ఆదివారం వర్చువల్ టీం రూపకల్పనతో కలిసొచ్చిన అదృష్టం
- ‘49 కేటగిరీ’ తొలిస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్న డ్రైవర్
అయితే..ఈమారు అతడి టైం కలిసొచ్చింది. ఆదివారం నాటి కోల్కతా-పంజాబ్ మ్యాచ్ సందర్భంగా అతడు ‘49 కేటగిరీలో’ ఓ వర్చువల్ టీం రూపొందించి తొలిస్థానంలో నిలిచాడు. దీంతో.. ఏకంగా రూ.1.5 కోట్లు అతడి సొంతమైంది. యాప్లో అతడి పేరిట ఉన్న వాలెట్లో ఈ మొత్తం జమ అయ్యింది. ఇప్పటికే షాహబుద్దీన్ తన వ్యాలెట్లోని రూ.20 లక్షలను విత్గ్రా చేసుకున్నాడు. ఇందులో ఆరు లక్షలు పన్ను కింద పోగా మిగిలిన 14 లక్షల అతడి బ్యాంకు అకౌంట్కు చేరింది.
తన కల ఇన్నాళ్లకు ఫలించడంతో షహాబుద్దీన్ ఆనందానికి అంతేలేకుండా పోయింది. మధ్యప్రదేశ్లోని సెంథ్వా ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివసించే అతడు ఈ డబ్బుతో ఓ సొంతిల్లు కొనుక్కుంటానని మీడియాకు చెప్పాడు. అంతేకాకుండా.. మిగిలిన డబ్బుతో సొంతంగా ఓ వ్యాపారం కూడా ప్రారంభిస్తానని పేర్కొన్నాడు.