K Kavitha: ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ముగిసిన కవిత విచారణ

ED questioning on Kavitha concludes
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
  • ఇప్పటికే కవితను ఓసారి ప్రశ్నించిన ఈడీ
  • నేడు రెండోసారి విచారణ
  • సుమారు 10 గంటల పాటు విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఇవాళ సుదీర్ఘంగా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. కొద్దిసేపటి కిందటే కవిత విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు కవితను ప్రశ్నించారు. 

లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఉదయం ఈ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించిన అధికారులు, ఆ తర్వాత ఆమెను విడిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
K Kavitha
ED
Delhi Liquor Scam
BRS
Telangana

More Telugu News