ఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ
- చెన్నైలోని ఆమె నివాసంలో లాకర్ లోని నగలు మాయం
- తేయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు
- పనివారిపై అనుమానం వ్యక్తం చేసిన ఐశ్వర్య
ఐశ్వర్య తన ఇంటిలోని లాకర్ లో ఉంచగా, ఈ విషయం కొంత మంది పనివారికి తెలుసునని ఎఫ్ఐఆర్ కాపీ చెబుతోంది. సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ లాకర్ ను ఆమె పలు సందర్భాల్లో వేర్వేరు ఇళ్లకు తరలించినట్టు వివరించారు. 2022 ఏప్రిల్ లో పోయస్ గార్డెన్ లోని నివాసానికి లాకర్ ను తరలించారు.
ఫిబ్రవరి 18న ఆమె లాకర్ ను తెరిచి చూడగా, తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాక్ అయ్యారు. డైమండ్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయి. తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్ పై అనుమానం వ్యక్తం చేశారు.