ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగానే గొప్పగా ఫీల్ అవుతున్నారు... 2024 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలు: కాకాణి
- చంద్రబాబుకు ఇవే ఆఖరి విజయోత్సవాలు అన్న కాకాణి
- మోసాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్య
- ప్రజల ప్రాణాలు కాపాడటానికే జీవో నెంబర్ 1 అని వెల్లడి
మోసాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని... ఆయనకు గోకర్ణ, గజకర్ణ విద్యలన్నీ తెలుసని కాకాణి విమర్శించారు. వర్షాలు ఆగిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చామని చెప్పారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని విమర్శించారు. అంగన్ వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని... తమ ప్రభుత్వం అంగన్ వాడీల సమస్యల పట్ల తగిన విధంగా స్పందిస్తుందని చెప్పారు.