Bharat Gaurav Rail: సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ‘భారత్ గౌరవ్’ రైలు.. ప్రయాణికులకు కూచిపూడి నృత్యంతో స్వాగతం!

  • రైలును జెండా ఊపి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
  • 8 రాత్రుళ్లు, 9 పగళ్లు సాగనున్న యాత్ర
  • పూరి, కోణార్క్, గయ, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను చుట్టనున్న రైలు
First Bharat Gaurav train from Telugu states commences from Secunderabad

సికింద్రాబాద్ నుంచి తొలిసారి ఓ ‘భారత్ గౌరవ్’ రైలు బయలుదేరింది. దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఉద్దేశించిన ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 26 వరకు అంటే 8 రాత్రులు, 9 పగళ్లు సాగుతుంది. యాత్రలో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యకేత్రాల సందర్శన ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలో ఆగుతుంది. ఇందులోని ప్రయాణికులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. ఈ రైలులో ప్రయాణించే యాత్రికులకు కూచిపూడి నృత్యంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఐఆర్‌సీటీసీ ఛైర్మన్‌, ఎండీ రజనీ హసీజా, ఇతర అధికారులతో కలిసి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ యాత్రికులకు స్వాగత కిట్‌లు అందజేశారు.

More Telugu News