టీసీఎస్ సంస్థలో అనూహ్య మార్పు.. సీఈఓ రాజీనామా
- ప్రస్తుత సీఈఓ రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేసినట్టు టీసీఎస్ ప్రకటన
- బోర్డు, చైర్మన్తో చర్చించాకే రాజీనామాకు సిద్ధమయ్యానన్న రాజేశ్
- ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ సంస్థలో కొనసాగనున్నట్టు వెల్లడి
- తదుపరి సీఈఓగా కె.కృతివాసన్ ఎంపిక
కాగా.. టీసీఎస్ సంస్థ సీఈఓగా తనకు ఈ ఆరేళ్లు అద్భుతంగా గడిచిపోయాయని రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. సంస్థలో తనది 22 ఏళ్ల పాటు సాగిన అద్భుతమైన ప్రయాణమని చెప్పుకొచ్చారు. తన నేతృత్వంలో సంస్థ ఆదాయం 10 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని, మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందిందని పేర్కొన్నారు.
‘‘తదుపరి ఏం చేయాలనే విషయమై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇక.. రాజీనామా విషయమై సుదీర్ఘంగా ఆలోచించి, చైర్మన్తో పాటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో చర్చించాకే తప్పుకోవాలని నిర్ణయించాను’’ అని రాజేశ్ తెలిపారు. గతేడాదే ఆయన టీసీఎస్ సీఈఓగా పునర్నియమితులయ్యారు. 2027 వరకూ ఆయన సీఈఓగా కొనసాగాల్సి ఉండగా ఇంతలోనే ఆయన రాజీనామా చేశారు.