జైల్లోనే సిసోడియాను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు
- తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్న సిసోడియా
- ఈరోజు జైల్లోనే ప్రశ్నించనున్న ఈడీ అధికారులు
- అరెస్ట్ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా
మరోవైపు రాజకీయ కక్షల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేయిస్తోందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఇదే కేసులో హైదరాబాద్ కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని నిన్న కొన్ని గంటల సేపు ఈడీ విచారించింది. అనంతనం నిన్న సాయంత్రం అరెస్ట్ చేసింది.