630 మంది విద్యార్థులకు 4 మరుగుదొడ్లేనా?: జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
- చింతలపూడి ఎస్సీ గురుకుల పాఠశాల గురించి జగన్ కు లేఖ
- కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయన్న రామకృష్ణ
- నాడు, నేడు కార్యక్రమం ప్రకటనలకే పరిమితమా? అని ప్రశ్న
ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. విద్యారంగంలో నాడు, నేడు అనేది కేవలం ప్రచారానికి, ప్రకటనలకే పరిమితమా? అని పశ్నించారు. మీరు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ చింతలపూడి గురుకుల పాఠశాలను సందర్శించాలని సూచించారు.