రాత్రంతా సీబీఐ ఆఫీసులోనే గడిపిన మనీశ్ సిసోడియా
- సిసోడియాను నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన సీబీఐ
- ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న వైనం
- బీజేపీని ప్రజలు శిక్షిస్తారన్న కేజ్రీవాల్
మరోవైపు సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలిశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, రాజకీయ కుట్రల్లో భాగంగానే బీజేపీ ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. బీజేపీని ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారని చెప్పారు.
మరోవైపు ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేస్తుందనే విషయం తమకు ముందే తెలుసని చెప్పారు. సీబీఐ పూర్తిగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు.