Australia: దూకుడుగా ఆడుతున్న ఆసీస్... ఢిల్లీ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట

Australia counter attack after losing 1st wicket in second innings
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ టెస్టు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. టీమిండియాపై తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగు ఆధిక్యం పొందిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడేందుకు ప్రాధాన్యమిచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 12 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 

ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 6 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో అవుట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హెడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 39 పరుగులు చేయగా, లబుషేన్ 19 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 62 పరుగులు కాగా... రేపటి ఆటలో ఆసీస్ ను టీమిండియా ఎంత త్వరగా ఆలౌట్ చేస్తే అంత మంచిది. 

ఈ పిచ్ పై బ్యాటింగ్ నానాటికి కష్టసాధ్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, లక్ష్యఛేదన ఏమంత సులువు కాదు. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేయగా, టీమిండియా 262 పరుగులు చేసింది.
Go Back to Shorts
Australia
Team India
2nd Innings
Delhi Test

More Telugu News