భారతీయుల నెట్ వాడకం పెరుగుతోందట.. ఎంత వాడుతున్నారంటే..!
- సగటున ఒక్కొక్కరు నెలకు 19.5 జీబీ వాడేస్తున్నారు
- నోకియా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ అధ్యయనంలో వెల్లడి
- గతేడాదితో పోలిస్తే 13.6 శాతం పెరిగిన నెట్ వినియోగం
ఈ నేపథ్యంలోనే భారతీయుల నెట్ వాడకంపై ఆరా తీసేందుకు అధ్యయనం నిర్వహించగా.. దేశంలో సగటున నెలకు ప్రతీ ఒక్కరూ 19.5 జీబీ వాడుతున్నారని తేలింది. గడిచిన ఏడాదితో పోల్చితే భారత్లో డేటా వినియోగం ఏకంగా 13.6 శాతం పెరిగినట్లు తేలింది. ఈమేరకు ఈ వివరాలను నోకియా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండెక్స్ రిపోర్టు వెల్లడించింది.
మొబైల్ ఫోన్లకు సంబంధించిన డేటా వినియోగం గత ఐదేళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగింది. 2022కు సంబంధించి మొత్తం డేటా వినియోగంలో 4 జీ నెట్ వర్క్ 99 శాతం షేర్తో మొదటి స్థానంలో ఉందని ఈ నివేదికలో తేలింది. ముందుముందు నెట్ వాడకం మన దేశంలో మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.