రేపు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు.. నేడు హైదరాబాద్కు తరలింపు
- హైదరాబాద్ తరలించేందుకు వీలుగా నిందితులకు ప్రొడక్షన్ వారెంట్, సమన్ల జారీ
- ప్రత్యేక రక్షణ మధ్య నేడు హైదరాబాద్ తరలింపు
- తొలిసారి కోర్టు ఎదుటకు రానున్న నిందితులు
వీరిని హైదరాబాద్ తరలించేందుకు వీలుగా కడప జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్, బెయిలుపై ఉన్న ఇద్దరికి సీబీఐ నుంచి సమన్లు జారీ అయ్యాయి. వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు ఇటీవలి వరకు కడప కేంద్రంగా జరగ్గా, సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయింది.