తెలంగాణలో గ్రూప్-4కు భారీ డిమాండ్.. 9.5 లక్షల దరఖాస్తులు
- ముగిసిన దరఖాస్తు ప్రక్రియ
- 8,180 ఖాళీలు.. ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ
- జులై 1వ తేదీన గ్రూప్-4 పరీక్ష
ఈ లెక్కన గ్రూప్-4లో ఒక్కో పోస్టుకు 116 మంది పోటీపడుతున్నారు. కాగా, గ్రూప్-4 పరీక్షను జులై 1వ తేదీన నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది. ఇక, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని వార్డెన్లు, మాట్రిన్, సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు గడువు కూడా ముగియగా 581 పోస్టులకు 1,45,358 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 250 మంది పోటీ పడుతున్నారు. ఈ పరీక్ష ఆగస్టు నెలలో ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది.