కొత్త సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. మాక్ డ్రిల్ అంటున్న అధికారులు!
- ఈ తెల్లవారుజామున సచివాలయం నుంచి దట్టమైన పొగలు
- ఏ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయనే దానిపై లేని స్పష్టత
- 11 ఫైర్ ఇంజన్లతో అదుపులోకి తెచ్చిన సిబ్బంది
ఐదు, అరు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి సచివాలయాన్ని పరిశీలించారు. అయితే, అగ్ని ప్రమాదంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. కేవలం మాక్ డ్రిల్ అని చెబుతున్నారు. సచివాలయ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్ లో భాగంగా మంటలు వచ్చాయని అంటున్నారు. దాంతో, జరిగింది అగ్నిప్రమాదమా? కాదా? అనేది తెలియడం లేదు. దట్టమైన పొగల ధాటికి సెక్రటేరియట్ వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారింది.