'యమలీల' రీమేక్ తో ఆస్తులు అమ్ముకోవలసి వచ్చిందట!
- అప్పట్లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న కాట్రగడ్డ ప్రసాద్
- తమిళంలో 'యమలీల' రీమేక్ చేశానన్న నిర్మాత
- ఆ సినిమా వలన తట్టుకోలేని నష్టాలు వచ్చాయని వెల్లడి
- ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చానని వివరణ
"తెలుగులో 'యమలీల' సూపర్ హిట్ కావడంతో నేను తమిళ రీమేక్ హక్కులను తీసుకున్నాను. ఈ సినిమాను 'లక్కీమేన్' పేరుతో తమిళంలో కార్తీక్ .. సంఘవి .. మంజుల .. గౌండమణి .. సెంథిల్ ఇలా పెద్ద స్టార్స్ ను పెట్టి నిర్మించాను. ఒక రకంగా అప్పట్లోనే ఇది మల్టీ స్టారర్ సినిమా అని చెప్పుకోవాలి. ఆ సినిమా వలన తట్టుకోలేనంత నష్టం వచ్చింది" అని చెప్పారు.
"తమిళనాడులో యమధర్మరాజుకు సంబంధించిన సినిమాలు ఆడవు అనే విషయం, 'లక్కీమేన్' రిలీజ్ తరువాత నాకు తెలిసింది. ఈ సినిమా వలన చేసిన అప్పులు తీర్చడానికి 3 చోట్ల ఉన్న నా ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. అందువలన ఆ తరువాత నేను గ్యాప్ తీసుకోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.