Pakistan: పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం.. కాలువలో పడ్డ బస్సు.. 39 మంది మృతి

39 passengers dead in a bus accident in pakisthan
  • ఎగిసిపడిన మంటల్లో ప్రయాణికులు సజీవదహనం
  • ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ఉన్నారు: అధికారులు
  • గాయాలపాలైన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడి
పాకిస్థాన్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రాంతంలోని లాస్ బెలాలో ఓ బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో సిబ్బంది సహా 48 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాలువలో పడడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చాలామంది ప్రయాణికులు సజీవదహనమయ్యారని చెప్పారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని వివరించారు.

క్వెట్టా నుంచి కరాచీ వెళుతుండగా బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. మూలమలుపులో ఉన్న బ్రిడ్జి వద్ద బస్సు అదుపుతప్పిందని, రెయిలింగ్ ను ఢీకొని కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. గాయాలపాలైన వారిలోనూ కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.
Pakistan
bus accident
death
bus fire
balochistan

More Telugu News