ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారంటూ ప్రచారం.. ఖండించిన అధికారులు
- 62 నుంచి 65 ఏళ్లకు పెంచారని ప్రచారం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో
- అలాంటిదేమీ లేదని అధికారుల వివరణ
- తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
పదవీ విరమణ వయసు పెంచారన్న ప్రచారం ఎలా మొదలైందో నిగ్గుతేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీనిపై గుంటూరు డీఐజీకి ఆర్థిక శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయాలని ఎస్పీని డీఐజీ ఆదేశించారు. గతంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును జగన్ సర్కారు పెంచిన విషయం తెలిసిందే. గతంలో 60 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 2022 జనవరి 1 నుంచి 62 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది.