Balakrishna: 'వీరసింహారెడ్డి' ఓ సినిమా కాదు .. ఓ సవాల్: గోపీచంద్ మలినేని  

  • 'క్రాక్' హిట్ తో స్టార్ డైరెక్టర్ గా మారిన గోపీచంద్ మలినేని
  • 'వీరసింహారెడ్డి'తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన దర్శకుడు
  • లాక్ డౌన్ సమయంలో కథ రెడీ అయిందని వెల్లడి     
  • ఐదు నిమిషాల్లో బాలయ్య ఓకే చెప్పారని వివరణ  
Gopichand Malineni Interview

బాలయ్యతో గోపీచంద్ మలినేని 'వీరసింహా రెడ్డి' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో గోపీచంద్ మలినేని పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా గురించిన అనేక విషయాలను పంచుకున్నాడు. 

'క్రాక్' సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిన తరువాత 'లాక్ డౌన్' పడింది. ఆ సమయంలో ఇంటి దగ్గరే ఉండవలసి వచ్చింది. అప్పుడు బాలయ్య కోసం ఒక కథ .. పవన్ కల్యాణ్ కోసం ఒక కథను రెడీ చేసుకున్నాను. అదే సమయంలో మైత్రీవారు వచ్చి బాలయ్యతో ఒక సినిమా చేద్దామని అడిగారు. నేను కూడా ఆ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నానని అన్నాను. 

అందరం కలిసి వెళ్లి బాలయ్యకు కథ చెప్పాము .. ఐదు నిమిషాల్లో ఆయన ఓకే చేశారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. ఒక వైపున 'అఖండ' హిట్ తరువాత బాలయ్య .. 'క్రాక్' హిట్ తరువాత నేను చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకోవడమే ఒక సవాలుగా మారిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News