Vijay: తెలుగు రాష్ట్రాల్లో 'వారసుడు' 3 రోజుల వసూళ్లు ఇవే!

  • ఈ నెల 14వ తేదీన విడుదలైన 'వారసుడు'
  • భారీ పోటీమధ్య థియేటర్లకు వచ్చిన సినిమా 
  • 3 రోజుల్లో 8.9 కోట్ల షేర్ వసూలు
  • సినిమాను ఆదుకున్న తమన్ సంగీతం
Varasudu Movie Update

విజయ్ హీరోగా తమిళంలో రూపొందిన 'వరిసు' .. తెలుగులో 'వారసుడు' టైటిల్ తో ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. 

తెలుగు రాష్ట్రాల్లో తొలి 3 రోజుల్లో ఈ సినిమా 8.9 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే 3.61 కోట్లను రాబట్టింది. విజయ్ సినిమా ఇక్కడ 3 రోజుల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. 'వీరసింహారెడ్డి' .. 'వాల్తేరు వీరయ్య' వంటి భారీ సినిమాలతో పాటు 'వారసుడు' థియేటర్లకు వచ్చింది.

ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టయినర్ నేపథ్యంలో రూపొందిప్పటికీ, యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కి కూడా ప్రాధాన్యత ఉంది. ఇక ఇది తమిళంలో రూపొందిన తారాగణం పరంగా చూసుకుంటే తెలుగు సినిమానే అనిపిస్తుంది. కథాకథనాల పరంగా రొటీన్ గా అనిపించినప్పటికీ, సంగీతం ఈ సినిమాను కొంతవరకూ ఆదుకుందనే చెప్పాలి.

More Telugu News