అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్
- మంగళవారం సాయంత్రం కాల్ చేసిన దుండగుడు
- ఇప్పటికి రెండు సార్లు బెదిరింపు కాల్స్ చేసిన దుండగుడు
- స్కూల్ లో తనిఖీలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్
అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు దొరకలేదు. బాంబు పెట్టామని దుండగుడు ఫోన్ చేయడం ఇది రెండోసారని స్కూలు యాజమాన్యం తెలిపింది. అంతేకాదు తన ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సైతం దుండగుడు స్కూలుకు పంపించాడని చెప్పింది. అతని పేరు విక్రమ్ సింగ్ అని, గుజరాత్ కు చెందిన అతను పాప్యులారిటీ కోసం ఇలా చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్కూలు యాజమాన్యం తెలిపింది.