కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు
- బీఆర్ఎస్ అధినాయకత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు
- కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై కేసు
- వార్ రూమ్ కు తానే ఇన్చార్జినన్న మల్లు రవి
- ఈ నెల 12న విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ నోటీసులు
తాజాగా ఈ కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలంటూ సీఆర్సీపీసీ 41 కింద నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ వార్ రూమ్ కు తానే ఇన్చార్జిని అని, ఇస్తే తనకు నోటీసులు ఇవ్వాలి కానీ, సునీల్ కనుగోలుకు సంబంధమేంటని మల్లు రవి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మల్లు రవికి పోలీసులు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.
ఇక ఈ కేసులో సునీల్ కనుగోలును నేడు పోలీసులు విచారించారు. అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు.