Chandrababu: నారావారిపల్లెకు వెళ్లనున్న నారా, నందమూరి కుటుంబాలు

  • నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబాల సంక్రాంతి వేడుకలు
  • ఇప్పటికే ప్రారంభమైన ఏర్పాట్లు
  • 13న నారావారిపల్లెకు వెళ్తున్న చంద్రబాబు, లోకేశ్, బాలయ్య
Nara and Nandamuri families to go Naravaripalle

ప్రతి ఏడాది సంక్రాంతి వేడుకలను జరుపుకోవడానికి నారా, నందమూరి కుటుంబాలు టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లడం ఆనవాయతీ. ఇరు కుటుంబాలు సంక్రాంతిని నారావారిపల్లెలో ఘనంగా జరుపుకుంటాయి. ఈ సంక్రాంతికి కూడా నారావారిపల్లెకు వెళ్లడానికి ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు వీరు నారావారిపల్లెకు వెళ్లలేదు. ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులో ఉన్న తరుణంలో ఇరు కుటుంబాలు సంక్రాంతి వేడుకలకు సిద్ధమయ్యాయి. 

ఈ నెల 12న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, నారా దేవాన్ష్ లు నారావారిపల్లెకు చేరుకుంటారు. 13న చంద్రబాబు, నారా లోకేశ్, బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు వెళ్తారు. 16వ తేదీన చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ తిరుగుపయనమవుతారు. 17న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు పయనమవుతారు. ఇప్పటికే నారావారిపల్లెలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

More Telugu News