Sankranti 2023: సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం

  • స్కూళ్లకు ఈ నెల 12 నుంచి 18 వరకు సెలవులు
  • ఉపాధ్యాయ సంఘాల వినతితో మంత్రి బొత్స ఆదేశం
  • తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ అధికారులు
Change In Sankranti Holidays in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లోని స్కూళ్లకు ఇప్పటికే ప్రకటించిన సంక్రాంతి సెలవులలో ప్రభుత్వం మార్పులు చేసింది. మార్పుల వివరాలతో రాష్ట్ర విద్యాశాఖ తాజాగా జీవో విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా సంక్రాంతి సెలవులు ఈ నెల 11 నుంచి 16 వరకు ఉండగా.. ఈ నెల 17న స్కూల్స్ పున: ప్రారంభం కావాలి. 

అయితే, 17న ముక్కనుమ కావడంతో ఆ రోజు కూడా సెలవు ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 

ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు తాజాగా జీవో విడుదల చేశారు. ఈ నెల 19 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

More Telugu News